100 రోజుల పాలనలో మోడీ అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ సమైక్యతకు కట్టుబడిందని తెలియజేసారు. కాంగ్రెస్ సహా విపక్షాలు ఇకనైనా రాజకీయాలు మాని దేశ సమైక్యతకు కలిసి రావాలి అని హితవు పలికారు. ఆంధ్ర ప్రదేశ్లో జగన్ ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైన మార్గదర్శనం లేదని , అందువలన ప్రభుత్వం విఫలమయ్యే అవకాశం ఉందని మురళీధర్ రావు అభిప్రాయపడ్డారు.