ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు ఏర్పాట్లు

Update: 2020-06-18 08:18 GMT

రేపు రాష్ట్రంలో 4 రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు. శాసనసభ ప్రాంగణంలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న అసెంబ్లీ సిబ్బంది. రాజ్యసభ ఎన్నికకు భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. 5 గంటల కు కౌంటింగ్ ప్రక్రియ

6 గంటల కు ఫలితాలు వెల్లడించనున్న రిటర్నింగ్ అధికారి. బరిలో వైసీపీ నుంచి నలుగురు అభ్యర్థులు, టీడీపీ నుంచి ఒక అభ్యర్థి. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మాక్ పోలింగ్. ఓటు ఎలా వేయాలన్న అంశంపై వైసీపీ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వనున్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. వైసీపీ నుంచి బరిలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ, పారిశ్రామిక వేత్త అయోధ్య రామిరెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు పరిమల్ నత్వాని. టీడీపీ నుంచి పోటీలో వర్ల రామయ్య ఉన్నారు.

Tags:    

Similar News