ఏపీలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ

Update: 2019-06-20 09:22 GMT

ఏపీలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగలబోతోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాపు సామాజికవర్గానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారు. తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ, బొండా ఉమా, ఈలి నాని, పంచకర్ల రమేష్‌‌బాబు సహా పలువురు కాపు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ లేదా వైసీపీలో చేరాలన్న విషయంపై ఈ నేతలు సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, గరికపాటి రామ్మోహన్, సి.ఎం.రమేష్, టి.జి.వెంకటేష్ కూడా బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది.  

Tags:    

Similar News