కోర్టు స్టే ఇచ్చింది డ్యామ్, హెడ్ వర్క్స్ గురించి కాదని పవర్ ప్రాజెక్టు గురించి మాత్రమేన్నారు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. రివర్స్ టెండరింగ్కి వెళితే అవినీతి బయటపడుతుందని చంద్రబాబుకు భయం పట్టుకుందని తెలిపారు. కోర్టు తీర్పును గౌరవిస్తామని ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ ఆపేస్తున్నట్లు టీడీపీ హడావుడి చేస్తోందని అన్నారు. పోలవరంపై మొదటి నుంచి తమ విధానం ఒకటేనని, అవినీతిని వెలికి తీసి ప్రజా ధనాన్ని కాపాడటమే అని అన్నారు.