Breaking: స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

Update: 2020-03-16 07:31 GMT
Supreme Court

ఏపీ స్థానిక ఎన్నికల వాయిదా వేడి సుప్రీంకోర్టు కు చేరింది. స్థానిక ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరోనా నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించాలంటూ ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల వాయిదా అంశాన్ని జస్టిస్‌ లలిత్‌ ధర్మాసనం ముందు ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ప్రస్తావించారు. దీనిపై జస్టిస్‌ లలిత్‌ స్పందిస్తూ రేపటి కేసుల జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.

Tags:    

Similar News