ఒంగోలు బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. శాంతిభద్రతల సమీక్ష సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీతో ప్రత్యేకంగా ఈ విషయంపై చర్చించిన జగన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. 24 గంటల్లోగా నిందితులను పట్టుకున్నామని ఈ సందర్భంగా ఎస్పీ వెల్లడించారు. అభినందనలు తెలిపిన జగన్ పరిహారం ఇవ్వాలంటూ హోంమంత్రిని ఆదేశించారు. బాధితురాలి కుటుంబానికి 5 లక్షల పరిహారం ఇస్తామని సుచరిత సీఎంకు తెలిపారు.