అమలాపురం లోకల్ వార్ లో లవ్ స్టోరీ

Update: 2020-03-14 11:57 GMT

ప్రేమించి మోసగించిన వైసీపీ నేత తనయుడు తీరుపై ఓ యువతి వినూత్న నిరసన తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో వైసీపీ కీలక నేత కుమారుడు తనను ప్రేమించి ‌పెళ్లికి నిరాకరించాడని సూర్యనగర్ కు చెందిన బైరుశెట్టి రేణుక ఆరోపించింది. తమ ప్రేమ వ్యవహారం పోలీసులు, రాజకీయ నేతల వద్దకు తీసుకు వెళ్లినా న్యాయం జరగలేదని వాపోయింది. తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తానంటుంది బాధిత యువతి. ఎంబీఏ చ‌దువుకుంటున్న రేణుక స్వ‌తంత్ర అభ్యర్థిగా ఎన్నిక‌ల బ‌రిలో దిగింది. త‌న‌కు జ‌రిగిన అన్యాయం గురించి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వెళ్లి వివ‌రించి ప్రేమికుడికి బుద్ధి చెబుతాన‌ని ఆ యువ‌తి హెచ్చరిస్తోంది. 

Tags:    

Similar News