Coronavirus: ఏపీలో మరో 740 కరోనా పాజిటివ్‌ కేసులు

Update: 2020-06-27 08:23 GMT

740 new coronavirus cases reported in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 740 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 24,458 శాంపిల్స్‌ని పరీక్షించగా 740 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 263 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా గడిచిన 24 గంటల్లో 11 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో నలుగురు , కర్నూలు జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు మృతి చెందారు. 

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 10,093. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 157. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4284కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 5652 మంది చికిత్స పొందుతున్నారు.



 



Tags:    

Similar News