Intermediate Admission : ఇంటర్‌ ప్రవేశాలు షురూ..బోర్డు మార్గదర్శకాలు జారీ

Intermediate Admission :  ఇంటర్‌ ప్రవేశాలు షురూ..బోర్డు మార్గదర్శకాలు జారీ
x
Highlights

Intermediate Admission : ప్రతి ఏడాది జూన్, జూలైలో ప్రారంభం కావలసిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ క్లాసులు ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా ఆలస్యంగా మొదలు...

Intermediate Admission : ప్రతి ఏడాది జూన్, జూలైలో ప్రారంభం కావలసిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ క్లాసులు ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా ఆలస్యంగా మొదలు కానున్నాయి. ఇందులో భాగంగానే 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ఇంటర్‌ కాలేజీల్లో అడ్మిషన్లకు తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు అనుమతి ఇచ్చింది. దీనికి సంబందించిన తొలి విడుత నోటిఫికేషన్‌ను బుధవారం బోర్డు సెక్రటరీ సయ్యద్‌ ఒమర్‌జలీల్‌ జారీచేశారు. బోర్డు జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం రాష్ట్రంలోని అన్ని ఇంటర్మీడియెట్ కాలేజీల్లో అడ్మిషన్లు బుధవారం నుంచే ప్రారంభమయ్యాయి. ఈ నెల 30వ తేదీని తొలి విడుత ప్రవేశాలకు గడువుగా నిర్ణయించారు.

మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే రెండో విడత అడ్మిషన్లకు మరో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు ఇంటర్ డోర్డు. ఇక క్లాసుల విషయానికొస్తే ఈ నెల 18 నుంచి రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లో ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించుకునేందుకు అనుమతి ఇచ్చారు. రాష్ట్రంలో ఇంతకింతకు కరోనా కేసులు విస్తరిస్తున్నక్రమంలో ఇంటర్ రెగ్యులర్‌ తరగతులు నిర్వహించే పరిస్థితులు లేదు. దీంతో కళాశాల యాజమాన్యాలకు ఇంటర్ బోర్డు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేదుకు అనుమతినిచ్చింది. కళాశాల యాజమాన్యాలు కూడా విద్యార్ధుల భవిష్యత్తును, అలాగే విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహించడానికి మొగ్గుచూపుతుంది.

ఇక విద్యార్ధులు పదో తరగతి ఇంటర్నెట్‌ మార్కుల జాబితాతో తాత్కాలికంగా ప్రవేశాలు చేసుకోవచ్చని తెలిపింది. కళాశాలలో చేరిన అనంతరం వారు ఒరిజినల్ మార్కుల జాబితా, టీసీ సమర్పించాక ప్రవేశాలను ధ్రువీకరించాలని పేర్కొన్నది. ఇంటర్ ప్రవేశాల్లో రిజర్వేషన్లు, బోర్డు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు అడ్మిషన్ల పేరుతో ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించవద్దని, అలా పరీక్షలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇంటర్‌ బోర్డు విదించిన మార్గదర్శకాల విషయానికొస్తే అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులను ప్రేరేపించేలా ప్రకటనలు జారీ చేయవద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని బోర్డు తెలిపింది. కళాశాలల్లో నిండిన సీట్ల వివరాలు, అలాగే ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను ప్రతి రోజూ నోటీసు బోర్డులో ఉంచాలి. ప్రతి జూనియర్‌ కాలేజీలో ప్రవేశాలకు సంబంధించి బోర్డు మంజూరు చేసిన కోర్సులు, సెక్షన్లు, సీట్ల వివరాలను నోటీసు బోర్డులో అందరికీ తెలిసేలా పెట్టాలి. ఇక రాష్ట్రంలో ఉన్న ఎయిడెడ్‌, సోషల్‌, ట్రైబల్‌, బీసీ వెల్ఫేర్‌, అన్‌ఎయిడెడ్‌, మోడల్‌ స్కూల్‌, ప్రభు త్వ, ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశం పొందాలనుకు నే విద్యార్థులు వారి ఆధార్‌ నంబరును తప్పని సరిగా సమర్పించాలి. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అనుమతి పొందిన కోర్సులు, సెక్షన్లకు మాత్రమే ప్రవేశాలు నిర్వహించాలి. బోర్డు రద్దు చేసిన కాంబినేషన్లతో ప్రవేశాలు చేయవద్దు. ప్రతి విభాగంలో 88 కంటే ఎక్కువమంది విద్యార్థులను తీసుకోవద్దు. అర్హత పరీక్షల రికార్డుల్లో ఉన్న జోగిని పిల్లలకు సంబంధించి తండ్రి పేరుకు బదులు తల్లి పేరు చేర్చాలి. విద్యార్థులు అఫిలియేషన్‌ పొందిన జూనియర్‌ కాలేజీలో మాత్రమే ప్రవేశాలు పొందాలి. అనుబంధ కాలేజీల వివరాలకు acadtsbie.cgg. gov.in, tsbie.cgg.gov.in వెబ్‌సైట్లను సంప్రదించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories