Agra Road Accident: నిద్రిస్తున్న వారిపైకి కంటైనర్.. ఐదుగురు మృతి

Agra Road Accident: నిద్రిస్తున్న వారిపైకి కంటైనర్.. ఐదుగురు మృతి
x
AGRA ROAD ACCIDENT
Highlights

Agra Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై కంటైనర్ ఎక్కింది. దీంతో ఐదుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి

Agra Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై కంటైనర్ ఎక్కింది. దీంతో ఐదుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆగ్రాలో మంగళవారం రాత్రి జరిగింది. ఇక్కడి సికంద్ర పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గురుద్వార సమీపంలో ఫుట్‌పాత్‌పై మొత్తం ఏడుగురు వ్యక్తులు నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో కాన్పూర్ నుండి వస్తున్న కంటైనర్ నియంత్రిన కోల్పోయి ఫుట్‌పాత్ మీదకు ఎక్కింది. ఘాడ నిద్రలో ఉన్న మృతుల శరీరాలపైకి కంటైనర్ ఎక్కడంతో. తీవ్ర గాయాలతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.

అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను గుర్తించడంలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. అయితే మృతులు స్థానికులు కాదని తెలుస్తోంది. కానీ గాయపడిన వారిలో ఒకరు సెక్టార్ 16 లో ఉన్న హౌసింగ్ డెవలప్‌మెంట్ కాలనీకి చెందిన వారు కాగా, మరొకరు షాగంజ్కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న సికంద్ర పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేశారు. కంటైనర్ డ్రైవర్ , క్లీనర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్షమే అని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories