మిరపతోటలను పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క

మిరపతోటలను పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క
x
Highlights

మండలంలోని కాశీందేవిపేట గ్రామ శివారులో మిర్చి తోటలను ములుగు ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు.

ములుగు: మండలంలోని కాశీందేవిపేట గ్రామ శివారులో మిర్చి తోటలను ములుగు ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ... కాశీందేవిపేట గ్రామములో సుమారుగా 500 ఎకరాలలో మిర్చి పంటను సాగు చేస్తే కల్తీ విత్తనాల వలన వైరస్ సోకి 300 ఎకరాలలో పంట పూర్తి స్థాయిలో దెబ్బతిందని, విత్తన బాండాగారంగా తెలంగాణ రాష్ట్రంగా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కల్తీ విత్తనాల వలన రైతులు ఆత్మ హత్యలు చేసుకున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఉందని, నష్ట నివారణ చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

అదే విదంగా రైతుల క్రాఫ్ లొనులలో బ్యాంక్ అధికారులు క్రాఫ్ ఇన్స్యూరెన్స్ కట్ చెస్తున్నప్పటికీ రైతుల పంటలు నష్టపోతే మాత్రం ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందించకపోతున్నారని, వెంటనే కలెక్టర్ బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి పంట భీమా రైతుకు అందేలా చూడాలని అన్నారు. వెంటనే వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించాలని, లేని యెడల రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, మండల అధ్యక్షులు చాంద్ పాషా, సర్పంచ్ అహ్మద్ పాషా, గ్రామా కమిటీ అధ్యక్షులు మర్రి రాజు, ఉప సర్పంచ్ ఐలయ్య, మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories