CM KCR: త్వ‌ర‌లోనే గిరిజ‌న బంధు.. భూమి లేని గిరిజనులకు రూ.10లక్షల సాయం..

CM KCR Announces Girijana Bandhu
x

CM KCR: త్వ‌ర‌లోనే గిరిజ‌న బంధు.. భూమి లేని గిరిజనులకు రూ.10లక్షల సాయం..

Highlights

CM KCR: రాష్ట్రంలోని గిరిజనులకు సీఎం కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు.

CM KCR: రాష్ట్రంలోని గిరిజనులకు సీఎం కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. దళిత బంధు లాగే గిరిజన బంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భూమి లేని గిరిజనులకు 10లక్షల రూపాయలు సాయం చేస్తామన్నారు. పోడు భూములు పంచిన త‌ర్వాత అస‌లు భూములు లేని గిరిజ‌నుల‌ను తేలుద్దాం. ఆ లెక్క‌ను చూసిన త‌ర్వాత ద‌ళిత‌బంధు మాదిరిగా గిరిజ‌న బంధును కూడా అమ‌లు చేయ‌బోతున్నాం. భూమి, భుక్తి లేకుండా, ఎలాంటి ఆధారం లేని వారికి గిరిజ‌న బంధును త‌న చేతుల మీదుగా ప్రారంభిస్తాను. సాధించుకున్న స్వ‌రాష్ట్రంలో కులం మతం జాతి అనే బేధం లేకుండా జీవించాలి. ఈ దేశానికి మ‌నం వెలుగు దివిటీలం కావాలి. అవినీతి ర‌హితంగా ఈ ప్ర‌భుత్వాన్ని కాపాడుకుంటున్నామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories