పట్టపగలే దారుణం.. యువతి గోంతుకోసి.. ఆపై..

పట్టపగలే దారుణం.. యువతి గోంతుకోసి.. ఆపై..
x
Highlights

హైదరాబాద్ లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో యువతి గోంతుకోసి హత్య చేశాడు ఓ మృగాడు.ఈ దారుణం యూసుఫ్ గూడలోని ఓ జ్యూవెలరీ...

హైదరాబాద్ లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో యువతి గోంతుకోసి హత్య చేశాడు ఓ మృగాడు.ఈ దారుణం యూసుఫ్ గూడలోని ఓ జ్యూవెలరీ షాపులో జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలానికి చెందిన అగ్గిరాముడు, అన్నపూర్ణ దంపతులు కొన్నిరోజుల క్రితం నగరానికి వచ్చారు.. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అగ్గిరాముడు ఓ అపార్ట్మెంట్ కు రాత్రివేళా వాచ్ మెన్ గా పనిచేస్తూ పగలు ఇస్త్రీ పని చేసేవాడు. కుటుంబపోషణ నిమిత్తం అన్నపూర్ణ కూడా పనికి వెళ్తుండేది చిన్న కుమార్తె వెంకటలక్ష్మి (19) చదువు మానేసి పనులకు వెళ్ళేది. ఈ క్రమంలో ఆరునెలల కిందట యూసుఫ్ గూడలోని ఓ జ్యూవెలరీ షాపులో సేల్స్ గర్ల్ గా పనిచేస్తోంది. ఆమెకు పోలీస్ అధికారివద్ద డ్రైవర్ గా పనిచేసే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇక అప్పటినుంచి ఆమెను ప్రేమ పేరుతో వేధించసాగాడు ఆ వ్యక్తి. యువతి ఎంత చీదరించుకున్నా ఆమె వెంట పడేవాడు. దీంతో కోపోద్రిక్తుడైన అతను సోమవారం షాపులో ఉన్నవెంకటలక్ష్మి ని కట్టర్ తో గోంతుకోసి కిరాతకంగా హత్యచేశాడు.. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు.. అనుమానం రాకుండా ఏమి ఎరగనట్ట్టు ఆమె చనిపోయిందని బాధపడటం ప్రారంభించాడు.ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులకు సదరు హోమ్ గార్డ్ నిందితుడన్న విషయం అర్ధమైంది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొన్ని రోజుల్లో పెళ్లి చేద్దామనుకున్న తమ కుమార్తె విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories