జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆర్కేపురంలోని కేంద్రీయ సైనిక్ బోర్డుకు వెళ్లిన పవన్.. సైనిక అధికారులకు కోటి రూపాయల చెక్ అందజేశారు.
బోర్డుకు సహాయం అందించాలంటూ బ్రిగేడర్ వీరేంద్ర కుమార్ లేఖ తనను కదలించిందన్నారు. దేశాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరూ సైనిక్ బోర్డుకు సహాయం అందించాలన్నారు పవన్. అది సైనిక కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.