బాలయ్య పక్కన పెట్టన కథతో గోపీచంద్ సినిమా?

Update: 2020-06-09 07:32 GMT
Balakrishna and Gopichand (File Photo)

దర్శకులు ఒకరి కోసం కథ రాసుకోవడం..ఆ హీరో నో చెప్పడం.. ఆ కథ మూలకి వెళ్లిపోవడం మన తెలుగు సినిమా పరిశ్రమలో చాలా సహజం. అలా పక్కకు పోయిన కథలు కొంతకాలం తర్వాత వేరే హీరోతో తెరకెక్కి హడావుడి చేస్తాయి. ఒక్కోసారి అవి బ్లాక్ బస్టర్ గా రికార్డులు సృష్టిస్తాయి. కొన్ని మూన్నాళ్ల ముచ్చటలా మెరిసి మాయం అవుతాయి.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. గోపీచంద్, బాలకృష్ణల సినిమాల మధ్య చోటుచేసుకున్న పరిణామాలు ఇటువంటివే. ఇటీవలే బాలకృష్ణ రులర్ చిత్రం ద్వారా ప్రేక్షకులని పలకరించాడు. మొదట ఈ కథను దర్శకుడు పరచూరి మురళి హీరో గోపీచంద్ కు వినిపించారట. కానీ, గోపీచంద్ ఆ కథను సున్నితంగా తిరస్కరించాడు. అయితే తరువాత దర్శకుడు కె.ఎస్.రవికుమార్ బాలకృష్ణతో రూలర్ చిత్రాన్ని తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక గోపీచంద్ తాజాగా నటిస్తున్న చిత్రం అలివేలు వెంకటరమణ. తేజ దర్శకుడు.

దర్శకుడు తేజ ఈ అలివేలు వెరకటరమణ సినిమా కథని ముందుగా బాలకృష్ణకు వినిపిస్తే..ఈ కథను పక్కన పెట్టి బాలకృష్ణ తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ మొదలు పెట్టారు. ఆ తరువాత దర్శకుడు తేజ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. తరువాత బాలకృష్ణ దర్శకుడు క్రిష్ తో కలిసి తెరకెక్కించారు.

ఇక దర్శకుడు తేజ అప్పటి 'అలివేలు వెంకటరమణ' స్టోరీని బయటకు తీసి గోపీచంద్ కు వినిపించాడు. కథ నచ్చి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ లు మొదలు పెట్టిన తరువాత ఈ చిత్రం పట్టాలు ఎక్కనుందని సమాచారం. గోపీచంద్ వద్దనుకున్న రూలర్ బాలకృష్ణ కు చేదు అనుభవాన్నిచ్చింది. మరి బాలయ్య బాబు నో అన్న ఈ వెంకటరమణ గోపీచంద్ కి కలిసొస్తుందో లేదో వేచి చూడాలి.


Tags:    

Similar News