ఇప్పుడు టాలీవుడ్లో రెండంటే రెండే ప్రతిష్టాత్మక సినిమాలు విడుదల కానున్నాయి. ఆ రెండు సినిమాలకోసం అభిమానులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మొత్తాని ఆ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమౌతున్నాయి. అందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సాహో ఒకటి .. రెండోది మెగాస్టార్ చిరంజీవి హీరోగా 151 సినీమా సైరా నర్సింహారెడ్డి. ఈ రెండు చిత్రాలు కొద్దిపాటి గ్యాప్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ సాహో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుండాగా... ఇటు మెగాస్టార్ సినిమా సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న విడుదలకు రెడీ అవుతోంది.
తాజాగా ఈ రెండు సినిమాలకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్లో జోరుగా వినిపిస్తోంది. సాహో మూవీ రిలీజ్ తోనే సైరా ప్రమోషన్లలో వేగం పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారట చిత్ర నిర్మాతలు. అందుకే సాహో సినిమాతో పాటు సైరా థ్రియేట్రికల్ ట్రైలర్ను థియేటర్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే టీజర్తో దూమ్మురేపిన సైరా టీం, ట్రైలర్ను మరింత ఆసక్తికరంగా రూపొందిస్తున్నారు.