శ్రీరెడ్డి ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడూ ఏదో ఒక సంచలన కామెంట్స్తో వార్తల్లో ఉండే ఈ అమ్మడు ఈసారి మరో సీరియస్ కామెంట్స్ చేసింది. అయితే ఈ సారి రాజకీయ నేతలపైనో లేక..మరే వ్యాపారవేత్తలపైనో కాదు. ఈసారి ఏకంగా టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జుననే టార్గెట్ చేసింది. నాగార్జున గారికి తెలిసినన్ని పాలిటిక్స్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి కూడా తెలియవు. డబ్బిస్తే బిగ్ బాస్ హీరో... ఇవ్వకపోతే బిగ్ బాస్ ఒక వెధవ' అంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు.నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇప్పటికే షో మీద గతంలో పెద్ద దూమ్ముదుమారమే రేగింది. అయిుతే బిగ్ బాస్లో కంటెస్టెంట్ గా వెళ్లాలంటే లైంగిక కోర్కె తీర్చాలని అడిగారంటూ శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా ఆరోపించారు. ఈ ముచ్చట ఏకంగా దేశరాజధాని ఢిల్లీ వరకు వెళ్లి ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు బిగ్ బాస్ 3లో శ్రీరెడ్డికి చోటు దక్కుతుందని కూడా జోరుగా ప్రచారం సాగింది. అయితే, ఆమె మాత్రం రియాలిటీ షోలో కనిపించలేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో అప్పుడే మొదటి వారం ఎలిమినేషన్ కూడా జరగబోతోంది. హేమ, జాఫర్, వితిక, రాహుల్ ఎలిమినేషన్కు నామినేట్ అయ్యారు. అయితే, వారిలో ఎవరు బయటకు వెళ్తారనే తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇటీవల 'బిగ్ బాస్'పై వివాదం చెలరేగడం, దానిపై కింగ్ నాగార్జున స్పందించిన నేపథ్యంలో శ్రీరెడ్డి ఈ కామెంట్స్ చేసినట్లు అర్థమౌతోంది. దీనిపై కింగ్ నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.