యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా భారీ సినిమా సాహో. ఆగస్టు పదిహేనున విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో సాహో ను తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్ 300 కోట్ల పైమాటే. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ఇదే. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నైజాం రైట్స్కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది.
దిల్ రాజు గురించి పరిచయం అక్కర్లేదు. సినిమా డిస్ట్రిబ్యూషన్ లో.. నిర్మాణంలో తనదంటూ ఓ శైలి ప్రస్ఫూటంగా ఉంటుంది. ఇపుడు దిల్ రాజు చేతికి సాహో నైజాం హక్కులు వచ్చాయన్నది టాలీవుడ్ టాక్. దాదాపు 45 కోట్ల వరకు ఈ రైట్స్ కోసం ఆఫర్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ, సినిమా వర్గాల్లో మాత్రం ఈ విషయమై బోలెడంగా హంగామా నడుస్తోంది. ఈ వార్త అందరి నోటిలోనూ ప్రస్తుతం నానుతోంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు.