పాలకొల్లులో పవన్ ఫిలిం ఇనిస్టిట్యూట్!

Update: 2019-06-30 10:10 GMT

దిగ్గజాలను తెలుగు తెరకు అందించిన పాలకొల్లు పట్టణంలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ను ప్రారంభించనున్నట్టు జనసేన పార్టీ ప్రకటించింది. ఎస్వీ రంగారావు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ గా ఈ సంస్థకు పేరు పెట్టినట్టు వెల్లడించింది. అల్లురామలింగయ్య, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ పాలకొల్లు నుంచే వచ్చారని వివరించింది. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఈ విషయాలను తెలిపారు. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కు హరిరామ జోగయ్య చైర్మన్ గా వ్యవహరిస్తారని చెప్పారు.

రాజా వన్నెంరెడ్డి, బన్నీవాసు నేతృత్వంలో ఈ ఇన్ స్టిట్యూట్ నడుస్తుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల యువతకు ఉపయోగపడేలా ఈ సంస్థను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ ఇన్ స్టిట్యూట్ లో నటన, దర్శకత్వంలో శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ ఇన్ స్టిట్యూట్ ప్రిన్సిపాల్ గా రాజా వన్నెంరెడ్డి వ్యవహరిస్తారనీ, సంస్థ ప్రారంభోత్సవానికి పవన్ కల్యాణ్ వస్తారని ప్రకటించారు. 

Tags:    

Similar News