"ఓ బేబీ" చిత్ర బృందం విజయవాడ కనక దుర్గ అమ్మవారిని దర్శించుకుంది. సినిమా హీరోయిన్ సమంత, సినిమా దర్శకురాలు నందిని రెడ్డి ఇతరులు ఓ బేబీ విజయవంతం అయిన సందర్భంగా బుధవారం అమ్మవారి దర్శనానికి వచ్చారు. అమ్మవారి దర్శనానంతరం వీరికి వేదపండితులు వేద ఆశీర్వచనము చేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి వలనుకొండ కోటేశ్వరమ్మ, ఐ.ఆర్.ఎస్ అమ్మవారి ప్రసాదము, చిత్రపటము, క్యాలండర్ ను వీరికి అందజేసి అభినందనలు తెలియచేశారు.