ఇదివరకు సెలబ్రిటీలకు సంబంధించిన విశేషాలు తెలియాలంటే ఎంతో కష్టమయ్యేది. వారికి సంబంధించి ప్రచారం లోకి వచ్చిన విషయాలు నిజమో కాదో తెలియక తికమక పడేవారు అభిమానులు. ఇక సెలబ్రిటీలు, సినిమా తరాలకు కూడా తమ పై వచ్చిన పుకార్లను నిజం కాదని చెప్పుకోవాలంటే ఎంతో ఇబ్బంది. అంతే కాకుండా అభిమానులతో నేరుగా మాట్లాడే అవకాశమూ ఉండేది కాదు. కానీ, సోషల్ మీడియా ఇపుడు ఆ చింతలన్నీ తీర్చేసింది. ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ వేదికలు అభిమానులను.. సినీ తారలను అనుసంధానం చేస్తున్నాయి. చాలా మంది వీటిలో ఇప్పటికే మెరిసిపోతున్నారు. మెగా హీరో రామ్చరణ్ ఇప్పటికే ఫేస్ బుక్ లో చేరారు. అప్పుడప్పుడు తన అభిప్రాయాల్ని, విశేషాల్ని అందులో పంచుకొంటున్నారు. ఆల్వేజ్ రామ్చరణ్ అనే పేరుతో ఆయన ఖాతా తెరిచారు. వెంటనే వేల సంఖ్యలో అభిమానులు అనుసరించడం మొదలుపెట్టారు. రామ్చరణ్ ట్విట్టర్లో ఇంకా చేరలేదు. అక్కడ చరణ్కి సంబంధించిన విషయాల్ని ఆయన అర్ధాంగి ఉపాసన పంచుకొంటుంటారు. ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్'లో నటిస్తున్నారు రామ్చరణ్. మరో పక్క తండ్రి చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి'ని నిర్మిస్తున్నారు. ఇక ఇన్స్టాగ్రామ్ లో రామ్చరణ్ తాజా ఫోటోలని చూసే అవకాశం అభిమానులకు దొరికినట్టే.