వారిద్దరి వల్లే ఇలా ఉన్నాను.. అనసూయ

Update: 2019-06-27 17:13 GMT

నటి అనసూయ అంటే వెంటనే గుర్తు పట్టకపోవచ్చుకానీ, జబర్దస్త్ అనసూయ నటే మాత్రం గుర్తు పట్టని వారుండరు. అంతలా ఆ కార్యక్రమంతో పాపులర్ అయిపొయింది అనసూయ. ఆ పాప్యులారిటీ తోనే కొన్ని మంచి సినిమాల్లో చేసింది. రంగస్థలం, క్షణం వంటి మంచి సినిమాల్లో నటించినా.. జబర్దస్త్ గుర్తింపే ఆమెకు ఎక్కువ. ఇపుడు జబర్దస్త్ కార్యక్రమం ఐదేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె జబర్దస్త్ ప్రోగ్రాం డైరెక్టర్స్ పట్ల తన కృతజ్ఞత చెప్పుకుంది. జబర్ధస్త్ డైరెక్టర్స్ నితిన్, భరత్. ఇద్దరూ కలిసి ఈ షోను ఎంతో విజయవంతం చేయడంలో కీ రోల్ పోషించారంటూ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ వారిద్దరిన కృషిని కొనియాడింది. అంతేకాదు వాళ్లిద్దరి వల్లే తనకు సంతృప్తి కలిగిందంటూ చెప్పింది. అంతేకాదు జబర్థస్త్ ప్రోగ్రామ్.. ఐదేళ్లు కాదు.. యాభై ఏళ్ల ఇలాగే కొనసాగాలని కోరుకుంది. అంతే కాకుండా తనను ఇంతలా ఆదరించినందుకు ప్రేక్షకులకూ అభినందనలు చెప్పింది అనసూయ.  



Tags:    

Similar News