కాసేపట్లో గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు
కాసేపట్లో గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు చెన్నై లో జరగనున్నాయి.
కాసేపట్లో గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయన మనవడు, మనవరాలు విదేశాల నుండి చెన్నై చేరుకున్నారు. గొల్లపూడి భౌతికకాయానికి సినీ ప్రముఖులు నివాళులర్పించారు. టి.నగర్లోని కన్నమ్మపేట శ్మశానవాటికలో గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు జరగనున్నాయి.
ఈ నెల 12 వ తేదీన చెన్నైలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గొల్లపూడి మారుతీరావు మృతి చెందిన విషయం తెలిసిందే. గొల్లపూడి మరణవార్తతో సినీపరిశ్రమతో పాటూ సాహిత్య ప్రేమికులందరు విషాదంలో మునిగిపోయారు. గొల్లపూడి కుటుంబ సభ్యులు విదేశాల నుండి రావలసి ఉండటంతో అయన పార్ధివదేహాన్ని చెన్నై లో గల అయన నివాసం వద్ద ఉంచారు. ఈరోజు ఆయన మనవడు, మనవరాలు విదేశాల నుండి చెన్నై చేరుకోటంతో నేడు అయన అంత్యక్రియలు జరుగనున్నాయని అయన కుటుంబ సభ్యులు తెలిపారు. .