రాబోయే రోజుల్లో మరిన్ని కుట్రలు‌: జగన్

Update: 2019-03-31 09:33 GMT

రాబోయే రోజుల్లో మరిన్ని కుట్రలు జరుగుతాయంటున్నారు వైసీపీ అధినేత జగన్‌. తనపై ఎన్ని కుట్రలు చేసిన ధైర్యంగా ఎదుర్కొంటానని నెల్లూరు జిల్లా గూడురులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రకటించారు. ఏపీ ప్రజల కోసం నవ రత్నాల పేరుతో సంక్షేమ పథకాలు తెచ్చామని జగన్ అన్నారు. 2014లో 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటూ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్న భర్తీ చేయడం లేదంటూ ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. తనపై కేసులు పెట్టినా వెనక్కు తగ్గకుండా పోరాటం చేశానంటూ జగన్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో తాగు, సాగునీటి సమస్యలు తీర్చేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తామని జగన్ హామి ఇచ్చారు.    

Similar News