వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలి: వైఎస్‌ జగన్

Update: 2019-03-15 14:25 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌‌రెడ్డి పులివెందుల చేరుకుని నేరుగా వైఎస్ వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లిన జగన్‌ చిన్నాన్న మృతదేహాన్ని చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ సౌమ్యుడైన వివేకాను అత్యంత దారుణంగా కత్తులతో నరికి చంపారని జగన్ అన్నారు. బెడ్రూమ్‌లో చంపేసి బాత్రూమ్‌లో పడేశారని, 5సార్లు గొడ్డలితో నరికి చంపారు జగన్ అన్నారు. దర్యాప్తు తీరుపై అనుమానాలు ఉన్నాయని వెంటనే వివేకా హత్యపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి జగన్ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ హత్య వెనుక చాలా మంది ఉన్నారని ఆరోపించారు. హత్యలో ఎంత పెద్దవారు ఉన్నా వదిలిపెట్ట కూడదని జగన్‌ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Similar News