అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న జగన్
ప్రజా సంకల్పయాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ 14 నెలల తరువాత సొంత జిల్లాలోకి అడుగు పెట్టారు.
ప్రజా సంకల్పయాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ 14 నెలల తరువాత సొంత జిల్లాలోకి అడుగు పెట్టారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం జిల్లాకు వచ్చిన ఆయన కడపలోని అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. జిల్లాకు చెందిన పార్టీ నేతలతో కలిసి దర్గాకు చేరుకున్న ఆయన సంప్రదాయనుసారం చాదర్ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్గా పెద్దలు కూడా వైఎస్ జగన్ను ఆహ్వానించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్ జిల్లాకు చేరుకున్న జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతూ దారి పొడుగున పూల వర్షం కురిపిస్తూ తమ ప్రేమ, అభిమానాన్ని చాటుకుంటున్నారు.