వైసీపీలో చేరిన జనసేన నేత

Update: 2019-03-19 11:46 GMT

సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వరసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సీనీ ప్రముఖులు, టీడీపీ నుండి వైసీపీ గూటికి చేరాగా ఇటు జనసేన పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి వలస వస్తున్నారు. కాగా నేడు మంగళవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప.గో జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆ సభలో మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి కుమారుడు, జనసేన నేత యర్రా నవీన్‌ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుకు నిరసనగా తాను రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ వైయస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయడమే తమ లక్ష్యమన్నారు.yarra-naveen-joins-ysrcp-koyalagudem-meeting

Similar News