హర్యానాలోని మహేంద్రఘర్ జిల్లాలోని నైవాజ్ నగర్ గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. అత్తగారిని తల్లిలా చూసుకోవాల్సిన కోడలే అత్తను తీవ్రంగా చితకబాదింది. వేర్వేరు విషయాల్లో విసుగుచెందిన కోడలు ఆ కోపాన్ని తన అత్తగారిపై చూపించింది. ముసలి వయసులో మంచానికి పరిమితమైన ఆ పెద్దావిడ కోడలి దెబ్బలకు తట్టుకోలేక నానా అవస్థలు పడుతోంది. ఈ దృశ్యాలను అక్కడున్న ఓ అమ్మాయి తన సెల్ఫోన్లో బంధించి వైరల్ చేసింది. దీంతో ఆ వీడియో పోలీసులకు చేరడంతో కేసు నమోదు చేశారు. నైవాజ్ నగర్కు చేరుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కోడలు పరారీలో ఉంది. పరారీలో ఉన్న కోడలి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.