కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తాం-ఎర్రబెల్లి

Update: 2019-03-07 04:13 GMT

వరంగల్‌, మహబూబాబాద్‌ ఎంపీ స్థానాల్లో విజయం సాధించి సీఎం కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ చెప్పారు. వరంగల్‌లో కేటీఆర్‌ సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆయన 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఎదురేలేదని, కేసీఆర్‌పై ఉన్న విశ్వాసం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

Similar News