సికింద్రాబాద్ పరిధిలోని తుకారాంగేట్ పోలీసులు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్ లో ఓ యువకుడ్ని రక్తం వచ్చేటట్లు కొట్టారు. సిగరేట్ విషయంలో తలెత్తిన వివాదంలో సాయితేజా అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. కొద్ది సమయం తర్వాత రక్తం మరకలతో సాయితేజ బయటకు వచ్చాడు. అయితే పోలీసులు తనను కొట్టారని బాధితుడు చెబుతుండగా జారి పడటం వల్లే దెబ్బ తగిలిందని పోలీసులు చెబుతున్నారు. అక్కడే ఉన్న ఉన్న యువకుడి స్నేహితులు ఇదంతా వీడియోలో చిత్రీకరించడంతో పోలీసులు అతడిని విడిచిపెట్టారు. అకారణంగా తనను ఎస్ఐ రామ్లాల్, కానిస్టేబుల్ నాయక్ కొట్టారని, తాను కనీసం మద్యం కూడా తాగలేదని సాయి వాపోయాడు. మరోవైపు సాయితేజను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఓ సిగరెట్ వివాదంలో యువకుడ్ని పోలీసులతో అతిగా స్పందించినట్టు తెలిసింది.