ఇది ఊహించిన విజయమే!

Update: 2019-05-23 07:31 GMT

తమ గెలుపు పై ఎపుడూ తమకు నమ్మకముందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాము కచ్చితంగా భారీ విజయాన్ని సాధిస్తామని ఊహించామన్నారు. ఆయన గురువారం ఆయన గురువారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదానే తమ అజెండాగా పేర్కొన్నారు. ప్రజలు, దేవుడు వైఎస్సార్‌సీపీనీ ఆశీర్వదించారన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నరేంద్ర మోదీకి వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇక కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురించి ఇప్పుడే తానేమీ మాట్లాడనని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Similar News