సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ ముగింది. కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడికానుండటంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మొత్తం 542 లోక్సభ స్థానాలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. నేటి సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం రాజకీయ పార్టీలతో పాటు దేశ ప్రజలు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై అన్ని వర్గాల్లోనూ అమితాసక్తి నెలకొంది. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని సీట్లు సాధిస్తాయనే దానిపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 7 కేంద్రాల్లో ఇవాళ రీపోలింగ్ నిర్వహించారు. స్వల్ప ఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. మొత్తానికి ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.