నేడు ఇంటర్ బోర్డుపై మరోసారి హైకోర్టులో విచారణ

Update: 2019-06-10 03:56 GMT

ఇంటర్ బోర్డులో అవకతవకలపై నేడు మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ పై కౌంటర్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుంది. గ్లోబరీనా సంస్థకు ఇచ్చిన నోటీసులపై పిటిషనర్ వాదనలు వినిపించనున్నారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ రిపోర్టును ఇంటర్ బోర్డు ఇప్పటికే కోర్టుకి సమర్పించింది. చనిపోయిన 26 మంది విద్యార్థుల జవాబు పత్రాలను సిద్ధం చేసి పెట్టుకోవాలని గత విచారణలో ఆదేశించిన హైకోర్టు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియాపై కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News