తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటు అసెంబ్లీ ఆవరణలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్పీకర్ పోచారం ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మరికాసేపట్లో అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.