ఇంకా డైలమాలోనే తెలంగాణ బీజేపీ..

Update: 2019-03-24 07:56 GMT

నామినేషన్లకు ఇంకా ఒక్క రోజు మాత్రమే గడువు ఉన్నా అభ్యర్థులను ఖరారు చేయడంపై బీజేపీలో డైలమా నెలకొంది. పలు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినా వారికి బీ.ఫామ్స్ ఇవ్వడం లేదు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో టిక్కెట్టు రానివారి కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. పెద్దపల్లి ఎంపీ స్థానంలో వివేక్‌ను నిలబెట్టాలని ఆయన కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత సునీతా లక్ష్మారెడ్డిని కూడా కమలం గూటికి చేర్చేందకు ప్రయత్నిస్తున్నారు. అలాగే వరంగల్ స్థానానికి ముందుగా ప్రకటించిన చింతా సాంబమూర్తి స్థానంలో మాజీ మంత్రి విజయరామారావును ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.  

Similar News