అసెంబ్లీలో ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి: అసదుద్దీన్ ఓవైసీ

Update: 2019-06-08 10:35 GMT

టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం నేపథ్యంలో, తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిపోయింది. ఈ నేపథ్యంలో, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా ఎంఐఎం ఉందని ఈ నేపథ్యంలో, తమకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను ఇవ్వాలని స్పీకర్ ను కోరనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ కంటే తమకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలసి స్పీకర్ ను కలుస్తామని సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని అసదుద్దీన్ ఒవైసీ లిపారు. 

Tags:    

Similar News