తెలంగాణలో పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే సాయంత్రం 5గంటల్లోపు క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించనున్నారు. 16 లోక్సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 5గంటలకు పోలింగ్ ముగియగా ఒక్క నిజామాబాద్లో మాత్రం ఈవ్నింగ్ 6గంటల వరకు ఓటింగ్ జరగనుంది.
తెలంగాణలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4గంటలకే పోలింగ్ ముగిసింది. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్లో అలాగే పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని అదేవిధంగా వరంగల్ నియోజకవర్గంలోని భూపాలపల్లిలో అలాగే మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచంలో ఇక ఖమ్మం నియోజకవర్గంలో కొత్తగూడెం, అశ్వారావుపేటలో సాయంత్రం 4గంటలకే పోలింగ్ ముగిసింది.