ఎన్నికల ముందు కేంద్రం మోసపూరిత ప్రకటన: రామ్మోహన్‌నాయుడు

Update: 2019-02-28 10:54 GMT

ఏపీ ప్రజలు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న కల విశాఖ రైల్వే జోన్. అయితే బుధవారం విశాఖకు కేంద్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై టిడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు స్పందించారు. రైల్వేజోన్ కేవలం కంటితుడుపు చర్యే అని మండిపడ్డారు. వాల్తేరు డివిజన్‌ను ఒడిశా రాష్ట్రానికి ఇవ్వడం సరికాదని ఆయన పెర్కోన్నారు. భారత ప్రధాన మంత్రి మోడీ విశాఖ పర్యటనకు వస్తే నిరసనలు వెల్లువెత్తుయాని ముందే గ్రహించిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. కేవలం రానున్న ఎన్నికల దృష్యా కేంద్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని స్ఫష్టం చేశారు. విశాఖ రైల్వేజోన్ కోసం గత 2014 నుండి టీడీపీ పార్టీ అలుపేరగని పోరాటం చేస్తూనే ఉందని పెర్కోన్నారు. 

Similar News