శ్రీలంక టెర్రర్ ఎటాక్‌లో భారతీయుడు మృతి

Update: 2019-04-21 12:39 GMT

శ్రీలంకలో మారణహోమం జరిగింది. వరుస బాంబు పేలుళ్లతో కొలంబో చిగురుటాకులా వణికిపోయింది. కాగా ఈ బాంబు పేలుళ్లలో ఒక భారతీయ పౌరుడు చనిపోయినట్టు ధ్రువీకరించారు. కేరళలోని కసరగాడ్ జిల్లాకు చెందిన రసీనా అనే వ్యక్తి మృతిచెందినట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. 8చోట్ల జరిగిన దాడుల్లో సుమారు 190 మంది చనిపోయారు. మరో 500 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 35మంది విదేశీయులున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుళ్ల ఘటనలతో కొలంబోలో పెను విషాదం అలముకుంది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలాలు, ఆస్పత్రుల వద్ద అంతులేని ఉద్వేగ వాతావరణం నెలకొంది. వరుస బాంబు పేలుళ్లు శ్రీలంకను పెను విషాదంలో ముంచాయి.

Similar News