ప్రస్తుతానికి కాంగ్రెస్ను వీడే ఆలోచన లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. టీఆర్ఎస్ తానను పిలువలేదని, తాను ఆ ప్రయత్నం చేయడం లేదన్నారు. మీడియాతో చిట్ ఛాట్ చేసిన జగ్గారెడ్డి తన భవిష్యత్తు నిర్ణయం నియోజకవర్గ ప్రజలకు మేలు కలిగే విధంగా ఉంటుందన్నారు. టీఆర్ఎస్లోకి వెళ్లాలని ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో జరిపిన చిట్ చాట్లో పలు అంశాలను ప్రస్తావించారు. కాగా గతంలో కూడా సంగారెడ్డి అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరినట్టు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరగానే సంగారెడ్డికి ఐఐటీ తీసుకురాగలిగానని గుర్తుచేశారు. తన రాజకీయ అడుగులన్నీ ప్రజల కోసమేనని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కుటుంబ అవసరాల కోసమో, డబ్బు కోసమో తన రాజకీయ నిర్ణయం ఉండదని తెలిపారు. తన రాజకీయ పుట్టక బీజేపీలో జరిగితే టీఆర్ఎస్తో చట్టసభల్లోకి ప్రవేశించానని కానీ రాజకీయంగా పేరు తెచ్చింది కాంగ్రెస్ అని చెప్పారు.