ఔను.. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా: ఎమ్మెల్యే సండ్ర

Update: 2019-03-03 05:52 GMT

తాను త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెకంట వీరయ్య స్పష్టం చేశారు. హెచ్‌ఎంటీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన శనివారం కేసీఆర్‌తో భేటీ సందర్భంగా పార్టీ మారే అంశంపై కూడా చర్చించినట్లు వివరించారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదని ప్రజలంతా టీఆర్ఎస్‌ వైపే చూస్తున్నారని అందుకే తాను కూడా కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తున్నానని చెప్పుకొచ్చారు. తన అనుచరులు, మద్దతుదారులు ఒత్తిడి చేస్తున్నారని అందుకే టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరుతానని తెలిపారు. ఒకవేళ న్యాయపరంగా ఇబ్బందులు ఎదురైతే టీఆర్ఎస్‌ నుంచి మళ్లీ పోటీ చేసే అంశంపై చర్చిస్తున్నట్లు వివరించారు. 

Similar News