ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకోవడంపై ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ఎన్టీఆర్ జీవితఆధారంగా వెండితెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒక్క ఏపీలో తప్ప అన్నిచోట్ల మార్చి 29తేదీన పెద్దఎత్తున రీలీజ్ అయి భారీ విజయం సాధించింది. అయితే ఏపీలో ఎన్నికల ఆంక్షల కారణంగా వాయిదా పడిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్నికల పోలింగ్ పూర్తి కావటంతో మే 1న అంటే నేడు ఏపీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు సినీ దర్శకులు. అయితే గతంలో కోర్టు పోలింగ్ తరువాత ఈ సినీమాను రిలీజ్ చేసుకోవచ్చని ఉత్తర్వులు ఇవ్వడంతో సినిమా రిలీజ్కు పెద్దఎత్తున ఏర్పాటు చేసుకున్నారు.
అయితే తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదలపై గతంలో విడుదల చేసిన ఆంక్షలు ఇంకా అమల్లో ఉంటాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కోడ్ అమల్లో ఉండగా ఎలాంటి బయోపిక్ మూవీలు విడుదల చేయరాదని ఈసీ స్పష్టం చేసింది. దీంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు బ్రెక్ పడిన విషయం తెలిసిందే కాగా ఈసీ ఆదేశాలతో వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కోర్టు తీర్పుతో పాటు ఇచ్చిన ఈసీ లేకను తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన వర్మ, న్యాయపోరాటనికి సిద్ధమవుతున్నట్టుగా తెలిపారు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను అడ్డుకుంటున్న ఆ అజ్ఞాత శక్తులెవరో అందరికీ తెలుసంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.