నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఘన నివాళులు అర్పించారు. దేశ రాజధాని ఢీల్లీలోని రాజీవ్ సమాధి వీర్ భూమి వద్ద సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్లు సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు. దేశ వ్యాప్తంగా గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతిని నిర్వహించారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు వెళ్లిన రాజీవ్ గాంధీ 1991 మే 21 వ తేదిన హత్యకు గురైన విషయం తెలిసిందే.