పూతలపట్టు అభ్యర్థిని మార్చిన టీడీపీ..

Update: 2019-03-21 10:39 GMT

చిత్తూరు, ప్రకాశం జిల్లాలో అభ్యర్థులపై టీడీపీ అధిష్ఠానం సమాలోచన చేస్తోంది. పూతలపట్టు అభ్యర్థి పూర్ణం స్థానంలో లలితా థామస్‌ పేరును ఖరారు చేసింది. స్థానిక నేతల నుంచి వ్యతిరేకత రావడంతో పూర్ణంను మార్చినట్టు తెలుస్తోంది. అటు, దర్శి అసెంబ్లీ అభ్యర్థి మార్పుపైనా టీడీపీ అధిష్ఠానం చర్చించినట్టు తెలుస్తోంది. చివరకు, కదిరి బాబూరావునే కొనసాగించాలని నిర్ణయించింది. కదిరి బాబూరావును కొనసాగించడం వల్ల కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్టువుతుందని టీడీపీ అధిష్ఠానం భావిస్తోంది. కాగా పూతలపట్టులో వైసీపీ తరఫున ఎంఎస్ బాబు బరిలో దిగుతున్నారు.

Similar News