భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 22వ తేదీన పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్- సి 46 వాహక నౌకను నింగిలోకి పంపనున్నారు. షార్లోని మొదటి ప్రయోగ వేదికలో చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. వాహక నౌకకు సంబంధించిన అనుసంధానం పనులు ప్రస్తుతం పూర్తికావచ్చాయి. ఉపగ్రహం బెంగళూరు నుంచి రావాల్సి ఉంది. పీఎస్ఎల్వీ వాహక నౌక రీశాట్-2 బీఆర్ 1 రాడార్ ఇమేజింగ్ ఉప్రగహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.