వైసీపీలో చేరబోతున్నా : సినీ నిర్మాత

Update: 2019-03-24 07:30 GMT

ఏపీలో ఎన్నికల వేళ వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నుండి పలువురు నాయకులు చేరిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు సినీ నిర్మాత నట్టికుమార్ పార్టీలో చేరబోతున్నట్టుగా ప్రకటించారు. గత 1981 నుంచి కాంగ్రెస్‌లో ఉన్న నట్టి కుమార్, ఏపీలో టీపీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కొనసాగుతున్న చీకటి ఒప్పందం నచ్చకేనే కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీ పార్టీలోకి చేరుతున్నట్లుగా నట్టికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యల పట్ల నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ఓటు వేయకపోతే పసుపు కుంకాలు పోతాయి అనటం సరైందికాదు. ఆయన నీచంగా మాట్లాడుతున్నారు. జగన్‌మోహన్‌ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకే చంద్రబాబు పవన్‌ కల్యాణ్‌, కేఏ పాల్‌లను వాడుకుంటున్నారన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తెలంగాణలో ఆంధ్ర ప్రజలను కొడుతున్నారన్న వ్యాఖ్యలపై నట్టి కుమార్‌ స్పందించారు. పవన్‌కు ఎవరు చెప్పారో తెలియదు గాని తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు.

Similar News