ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు పవనోపదేశం.. క్యాడర్‌ విస్తరింపుకై ఫోకస్..

Update: 2019-05-13 02:41 GMT

ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక సమావేశమయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆయన అభ్యర్థులతో సమావేశమయ్యారు. పోలింగ్‌ సరళి, గెలుపు అంశాలపై అభ్యర్థులతో జనసేనాని చర్చించారు. కౌంటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవన్‌ అభ్యర్థులకు సూచనలు ఇచ్చారు. జనసేన పార్టీని బలోపేతం , గ్రామీణ ప్రాంతాల్లో క్యాడర్‌ విస్తరించుకోవడంపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో పవన్ విడతల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 50మంది అభ్యర్థులతో భేటీ అయ్యారు.

భవిష్యత్ కార్యక్రమాలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థాయిలో పార్టీ బలోపేతంపై పవన్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. వివిధ అంశాలపై పవన్ భవిష్యత్ వ్యూహాలను వివరించారు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల అనుభవాలు, ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఓట్ల లెక్కింపు రోజున వీవీ ప్యాట్‌ల లెక్కింపు, ఇతర అంశాలు జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ఆదర్శవంతమైన రాజకీయం చేయాలని పవన్ నేతలకు వివరించారు. పార్టీ కోసం పని చేసిన వారిని గుర్తించి స్థానిక ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని ముఖ్య నాయకులు పవన్‌కు సూచించారు. 

Full View

Tags:    

Similar News