రాజకీయాలపై పవన్ కీలక నిర్ణయం.. వాటిపై ప్రసక్తే లేదు..

Update: 2019-05-30 02:02 GMT

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు భీమవరం, గాజువాకలో ఓటమిపాలయ్యారు. దీంతో ఎన్నికల అనంతరం మళ్లీ సినిమాల్లోకి వస్తారని అంతా భావించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలతో బిజీ కాబోతున్నాడా? జనం కోసమే జనసేన అన్న తను ఎన్ని సార్లు, పొలిటికల్ గానే పోరాడతా నని అన్నా రూమర్స్ మాత్రం ఆగట్లేదు. కొత్తగా హరీష్ శంకర్ వెళ్లి పవన్ కి కథ చెప్పాడంటూ వచ్చిన మాటలు, గుసగుసల్నీ నిజమనిపించేలా తయారయ్యాయా? అని గుస గుసలు కోడై కూసాయి.

కానీ, వీటన్నీటికి చెక్ పెడుతూ పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక తాను ఇక సినిమాలు చేసే ప్రసక్తే లేదని, ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని పవన్ ప్రకటించారు. అయితే ఇది వరకే ఈ విషయాన్ని స్పష్టం చేసినా ఎన్నికల అనంతరం అదే మాటను కుండబద్దలు కొట్టడంతో పవన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. రాబోయే 25 ఏండ్లు కేవలం ప్రజల కోసమే పనిచేస్తానని, సినిమాల్లోకి తిరిగి చూసే ప్రసక్తే లేదని పవన్ తేల్చి చెప్పారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలు దక్కించేకొగా టీడీపీ 23, జనసేన కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించిన విషయం తెలిసిందే. 

Similar News