వైసీపీ లో చేరతానన్నది అవాస్తవం: రాయపాటి

Update: 2019-03-17 04:54 GMT

తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు.వీఐపీ బ్రేక్‌ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఓ వర్గం మీడియా అసత్యలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తాను తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వాన్ని తను బలపరుస్తున్నానని ఇక మీదటా అదే జరుగుతుందని చెప్పారు. నరసరావుపేట నుంచి లోక్ సభ అభ్యర్థిగా 22వ తేదీన నామినేషన్ వేయనున్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్న నమ్మకం తనకుందని చెప్పారు.

Similar News