టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

Update: 2019-06-05 03:49 GMT

టీడీపీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని షాక్ ఇచ్చారు. పార్లమెంటరీ విప్‌ పదవిని ఆయన తిరస్కరిస్తూ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో చేసిన పోస్ట్‌ ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిన్న టీడీపీ ముఖ్యనేతల సమావేశంలో లోక్‌సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్, పార్టీ విప్‌గా విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా సీఎం రమేష్‌ను నియమించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒక్కరోజు కూడా గడవక ముందే లోక్ సభలో టీడీపీపక్షనేతగా వుండడానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని విముఖత వ్యక్తం చేశారు. తన కంటే సమర్థవంతమైన వ్యక్తిని ఈ పదవిలో నియమించాలని పార్టీ అధినేత చంద్రబాబును కోరారు. తనపై మరోసారి విశ్వాసం ఉంచిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన కేశినేని నాని.. లోక్ సభలో పార్టీ పక్షనేత పదవిలో తను ఉండకపోవడంపై క్షమాపణలు కోరారు. విజయవాడ ప్రజలు నన్ను ఎంపీగా ఎన్నుకున్నారు. వారి ఆశీస్సులు నాకున్నాయి. విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడమే తనకు ముఖ్యమని ఆయన తెలిపారు. ఎంపీ కేశినేని నాని నిర్ణయంపై పార్టీ స్పందించాల్సి ఉంది.

Tags:    

Similar News